Heavy Rain Effect: వాయుగుండంగా మారిన అల్పపీడనం ఉత్తరాంధ్రపై భారీ ఎఫెక్ట్‌.

Heavy Rain Effect

బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతోంది. తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన నేపథ్యంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ చేసింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇటు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరంలో తీవ్ర వాయుగుండం బలపడబోతోందని. పూరీ- దిఘా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దాంతో వచ్చే రెండు రోజుల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ అయింది. ఈ నాలుగు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

AP Dussehra Holidays 2024: Andhra Pradesh Government will announce Dussehra holidays for schools from October 4 to 13

మరిన్ని వార్తల కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

Loading

High Alert For AP- బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏపీకి వర్షాలే వర్షాలు

I'm Kesava, a passionate content creator and news presenter in Alluri Sitaramaraju District with experience at GenX Network. Sharing all things local news and Tribal issues. 🌐✨ #ContentCreator #LocalNews

Leave a Comment